అతను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎప్పుడు ఎలా ఉండాలో, పరిస్థితులను ఎలా అధిగమించాలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి. ఇలా పిల్లలకి ఎన్నో మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు క్షణికావేశంలో కొన్ని సమస్యల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త మరణించాడని తెలుసుకున్న భార్య రెండంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నర్సాపూర్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న రామారావు అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అమ్ములు రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమెకు కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే తమ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక ఈ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చూపులు స్థానికులను కలచివేశాయి. కాగా తమ ఉపాధ్యాయుడు మరణించాడు అన్న విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…