Mahesh Babu : సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్కు మధ్య ఉండే తగవు మామూలే. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప.. అని ఫ్యాన్స్ ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ సంబరపడిపోతారు. ఇక అవతలి హీరోల ఫ్యాన్స్ మాత్రం విమర్శలు చేస్తుంటారు. ఇది షరా మామూలే. కానీ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..
జనవరి 2020లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. అయితే అల వైకుంఠపురములో మూవీ మాత్రం కలెక్షన్ల పరంగా కొంచెం పైచేయి సాధించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పట్లో మహేష్ పై విమర్శలు చేశారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ప్రతి విమర్శలు చేశారు.
అలా ఇరు హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య అప్పటి నుంచి సోషల్ మీడియాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ పుష్ప మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయినప్పటికీ కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో ఆ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్లు నిర్వహించింది. అయితే అవన్నీ ఉత్త మాటలేనని, బోగస్ కలెక్షన్లు అని చెబుతూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇక ఇటీవలే మహేష్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి పుష్ప సినిమా చూశారు. దీంతో ఆ మూవీ బాగుందని కితాబిచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ చేసిన కామెంట్స్కు ఆయన ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాము ఒకవైపు మహేష్ కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంటే.. ఆయన ఇలా అల్లు అర్జున్ మూవీ బాగుందని చెప్పడం.. తమకు ఎంత మాత్రం నచ్చడం లేదని అంటున్నారు. అయితే చివరకు ఈవిషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…