Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లలో రాణిస్తున్నాడు. ఇప్పుడు ఏఎంబీ థియేటర్ నడిపిస్తున్న మహేష్ బాబు తెలుగులో ఆన్ లైన్ విద్యా బోధన కోసం కొత్త యాప్ ని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి ఒక మల్టీ నేషనల్ కంపెనీ తో చర్చలు జరుపుతున్నాడని , దీంట్లో మహేష్ బాబు దాదాపుగా రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
మహేష్ బాబుతోపాటు ఒక మల్టీ నేషనల్ కంపెనీ భాగస్వామ్యంలో కూడా ఇది రూపొందుతుందని సమాచారం. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…