Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్గా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇందులో మహేష్ పక్కన కీర్తి సురేష్ జోడీగా నటించగా.. పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా మహేష్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయన సొంత ప్రొడక్షన్ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అడివి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ను మహేష్ తాజాగా లాంచ్ చేశారు.
అయితే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మహేష్ను బాలీవుడ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను మార్చి ప్రచురించారు. బాలీవుడ్ అంటే తనకు ఇష్టంలేదని.. తనను బాలీవుడ్ తట్టుకోలేదని.. తెలుగులోనే తనకు సౌకర్యంగా ఉందని.. మహేష్ అన్నట్లు కథలు అల్లారు. అయితే దీనిపై చాలా మంది మహేష్ బాబును విమర్శించారు. ముఖ్యంగా ఉత్తరాది వారు ఆయనను ట్రోల్ చేశారు. అయితే దీనిపై మహేష్ స్పందించారు.
తాను ఒకటి అంటే.. మీడియా దాన్ని ఇంకోలా అర్థం చేసుకుందని.. తాను బాలీవుడ్ను విమర్శించలేదని.. మహేష్ అన్నారు. తనకు తెలుగు సౌకర్యంగా ఉంటుందన్న విషయం చెప్పానని.. అయితే తాను తెలుగులో నటించే సినిమాలే హిందీలో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు సినిమాలకు ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఆదరణ ఉందని.. కనుక తెలుగులోనే స్ట్రెయిట్ సినిమా చేస్తానని.. ఇతర భాషల్లో రిలీజ్ అయితే సంతోషమే కదా.. అని అన్నారు. అంతేకానీ తాను బాలీవుడ్ను విమర్శించలేదని స్పష్టం చేశారు. ఇక మహేష్ తన తరువాత సినిమా త్రివిక్రమ్తో చేయనున్నారు. వచ్చే ఏడాది వరకు ఈ మూవీ పూర్తవుతుంది. ఆ తరువాత రాజమౌళితో కలిసి సినిమా చేస్తారు. ఆ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. దీంతో మహేష్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రానుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…