Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్గా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇందులో మహేష్ పక్కన కీర్తి సురేష్ జోడీగా నటించగా.. పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా మహేష్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయన సొంత ప్రొడక్షన్ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అడివి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ను మహేష్ తాజాగా లాంచ్ చేశారు.
అయితే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మహేష్ను బాలీవుడ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను మార్చి ప్రచురించారు. బాలీవుడ్ అంటే తనకు ఇష్టంలేదని.. తనను బాలీవుడ్ తట్టుకోలేదని.. తెలుగులోనే తనకు సౌకర్యంగా ఉందని.. మహేష్ అన్నట్లు కథలు అల్లారు. అయితే దీనిపై చాలా మంది మహేష్ బాబును విమర్శించారు. ముఖ్యంగా ఉత్తరాది వారు ఆయనను ట్రోల్ చేశారు. అయితే దీనిపై మహేష్ స్పందించారు.
తాను ఒకటి అంటే.. మీడియా దాన్ని ఇంకోలా అర్థం చేసుకుందని.. తాను బాలీవుడ్ను విమర్శించలేదని.. మహేష్ అన్నారు. తనకు తెలుగు సౌకర్యంగా ఉంటుందన్న విషయం చెప్పానని.. అయితే తాను తెలుగులో నటించే సినిమాలే హిందీలో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు సినిమాలకు ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఆదరణ ఉందని.. కనుక తెలుగులోనే స్ట్రెయిట్ సినిమా చేస్తానని.. ఇతర భాషల్లో రిలీజ్ అయితే సంతోషమే కదా.. అని అన్నారు. అంతేకానీ తాను బాలీవుడ్ను విమర్శించలేదని స్పష్టం చేశారు. ఇక మహేష్ తన తరువాత సినిమా త్రివిక్రమ్తో చేయనున్నారు. వచ్చే ఏడాది వరకు ఈ మూవీ పూర్తవుతుంది. ఆ తరువాత రాజమౌళితో కలిసి సినిమా చేస్తారు. ఆ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. దీంతో మహేష్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…