Mahesh Babu : శీతల పానీయాల యాడ్స్ ఏమోగానీ హీరోలు పోటీ పడి మరీ యాడ్స్ చేస్తున్నారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మౌంటెయిన్ డ్యూ యాడ్తో ముందుకు వచ్చారు. గతంలో మహేష్ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. కానీ ఇటీవలే ఆయనతో థమ్స్ అప్ తెగతెంపులు చేసుకుంది. కారణం.. 3 ఏళ్ల కాలానికి గాను మహేష్ అత్యధిక రెమ్యునరేషన్ ను అడగడమే అని చెప్పవచ్చు.
థమ్స్ అప్ యాడ్లలో నటించేందుకు గాను గతంలో ఆ సంస్థ మహేష్కు 3 ఏళ్ల కాలానికి గాను ఏకంగా రూ.8 కోట్లను ఇచ్చిందట. అయితే ఇటీవలే ఆ కాంట్రాక్టు గడువు ముగిసింది. ఈ క్రమంలో మహేష్ రూ.10 కోట్లు అడిగారట. కానీ థమ్స్ అప్ అంత మొత్తం ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఆ సంస్థతో మహేష్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. తరువాత మౌంటెయిన్ డ్యూ సంస్థ మహేష్తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఆయన అడిగినంత మొత్తం ఇచ్చింది. దీంతో 3 ఏళ్ల కాలానికి గాను మహేష్ కు మౌంటెయిన్ డ్యూ రూ.10 కోట్ల భారీ మొత్తం ఇవ్వనుందని సమాచారం.
ఇక విజయ్ దేవరకొండకు థమ్స్ అప్ అదే 3 ఏళ్ల కాలానికి కాంట్రాక్టు ఇచ్చింది. ఈ క్రమంలోనే విజయ్కు 3 ఏళ్లకు ఆ సంస్థ రూ.2.50 కోట్లను ఇవ్వనుంది. ఇలా థమ్స్ అప్ తన ఖర్చును తగ్గించుకుంది. తమకు విజయ్ దేవరకొండ చాలు అని సరిపెట్టుకుంది. కానీ మౌంటెయిన్ డ్యూ మాత్రం కచ్చితంగా మహేష్ లాంటి పెద్ద స్టార్ కావాలని నిర్ణయించుకుంది. అందుకనే రూ.10 కోట్లను కూడా మహేష్ కు ఇచ్చేసింది. మరి రెండు యాడ్లలో ఎవరి యాడ్ ఎక్కువ పాపులర్ అవుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…