Mahesh Babu : శీతల పానీయాల యాడ్స్ ఏమోగానీ హీరోలు పోటీ పడి మరీ యాడ్స్ చేస్తున్నారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మౌంటెయిన్ డ్యూ యాడ్తో ముందుకు వచ్చారు. గతంలో మహేష్ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. కానీ ఇటీవలే ఆయనతో థమ్స్ అప్ తెగతెంపులు చేసుకుంది. కారణం.. 3 ఏళ్ల కాలానికి గాను మహేష్ అత్యధిక రెమ్యునరేషన్ ను అడగడమే అని చెప్పవచ్చు.
థమ్స్ అప్ యాడ్లలో నటించేందుకు గాను గతంలో ఆ సంస్థ మహేష్కు 3 ఏళ్ల కాలానికి గాను ఏకంగా రూ.8 కోట్లను ఇచ్చిందట. అయితే ఇటీవలే ఆ కాంట్రాక్టు గడువు ముగిసింది. ఈ క్రమంలో మహేష్ రూ.10 కోట్లు అడిగారట. కానీ థమ్స్ అప్ అంత మొత్తం ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఆ సంస్థతో మహేష్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. తరువాత మౌంటెయిన్ డ్యూ సంస్థ మహేష్తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఆయన అడిగినంత మొత్తం ఇచ్చింది. దీంతో 3 ఏళ్ల కాలానికి గాను మహేష్ కు మౌంటెయిన్ డ్యూ రూ.10 కోట్ల భారీ మొత్తం ఇవ్వనుందని సమాచారం.
ఇక విజయ్ దేవరకొండకు థమ్స్ అప్ అదే 3 ఏళ్ల కాలానికి కాంట్రాక్టు ఇచ్చింది. ఈ క్రమంలోనే విజయ్కు 3 ఏళ్లకు ఆ సంస్థ రూ.2.50 కోట్లను ఇవ్వనుంది. ఇలా థమ్స్ అప్ తన ఖర్చును తగ్గించుకుంది. తమకు విజయ్ దేవరకొండ చాలు అని సరిపెట్టుకుంది. కానీ మౌంటెయిన్ డ్యూ మాత్రం కచ్చితంగా మహేష్ లాంటి పెద్ద స్టార్ కావాలని నిర్ణయించుకుంది. అందుకనే రూ.10 కోట్లను కూడా మహేష్ కు ఇచ్చేసింది. మరి రెండు యాడ్లలో ఎవరి యాడ్ ఎక్కువ పాపులర్ అవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…