Maha Samudram : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మహాసముద్రం. లవ్ అండ్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుండడంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుందని, ఏకంగా 11 కోట్ల రూపాయలతో డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా థియేటర్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అక్టోబర్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ ఈ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…