Nagarjuna : తెలుగు బుల్లితెరపై కొనసాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో 5వ సీజన్ కొనసాగుతోంది. కాగా బిగ్ బాస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ పై పలు రకాల సంఘాలు వ్యతిరేకతను చూపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ అనేది మన సంస్కృతి కాదని అంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్ మాధవీ లత లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జునని కూడా టార్గెట్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ ను దారుణంగా వేధిస్తున్నారని, మానసికంగా అతన్ని బలహీనం చేస్తున్నారని కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ అవుతోంది.
ముఖ్యంగా బిగ్ బాస్ లో అనాగరిక చర్య జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ తోపాటు నాగార్జున కూడా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల సంఘాలు ఎలాగో స్పందించవని అన్నారు.
ఇక మాధవీలత తన పోస్ట్ లో మెన్షన్ చేసిన కంటెస్టెంట్ ఎవరై ఉంటారనే కోణంలో నెటిజన్లు తెగ వెతికేసుకుంటున్నారు. నాగార్జున, బిగ్ బాస్ టీమ్ ఒక్కొక్క విషయంలో అందరినీ సమాన దృష్టితో చూస్తారు కదా అని, వారు ఎందుకు కంటెస్టెంట్స్ ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తిస్తారని.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.
బిగ్ బాస్ పై గత కొంత కాలంగా ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర వర్గాల వారు కూడా స్పందిస్తూ.. బుల్లితెరపై వచ్చే ఏ ఒక్క ప్రోగ్రామ్ తోనూ నెగెటివ్ గా ప్రవర్తించరని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…