Maa Elections 2021 : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇంకో ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవి బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ కూడా గట్టిగానే క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే మంచు విష్ణు ఇప్పటికే కృష్ణ, బాలకృష్ణ, కృష్ణం రాజు వంటి సినీ ఇండస్ట్రీ పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ ఆ ప్రయత్నం చేయలేదు.
తాజాగా నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తనకు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదని, ఇండస్ట్రీ పెద్దలను కలవబోవడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. కాగా ఆయన కలిసే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ అవ్వలేదట. అందుకనే ఆయన ఇండస్ట్రీ పెద్దల గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ప్రకాష్ రాజ్ తన క్యాంపెయిన్లో తనకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ఉందని చెబుతూ వస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరూ ఆయనతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఒక్క నాగబాబు మాత్రమే అందుకు ముందుకు వచ్చారు. ఆయన ఇప్పటికే తమ్ముడు పవన్ కల్యాణ్కు చెందిన జనసేనలో నాయకుడిగా ఉన్నారు కనుక.. ఆ కోణంలో ఆయన అలా ప్రకాష్ రాజ్కు సపోర్ట్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రకాష్ రాజ్తో కనిపించడం లేదు. దీంతో పలు సందేహాలు వస్తున్నాయి. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్.. రెండు ప్యానెల్స్లో ఉన్న నటీనటులతో చిరంజీవికి, ఆయన కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఎన్నికల పేరిట ఆ బంధాన్ని తెంచుకోవద్దనే ఉద్దేశంతోనే చిరంజీవి తన కుటుంబ సభ్యులను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని వారించినట్లు తెలుస్తోంది. అందుకనే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.
అటు మోహన్ బాబుకు, ఇటు ప్రకాష్ రాజ్కు చిరంజీవి మిత్రులు. కనుకనే ఆయన ఎవరికీ ప్రచారం చేయవద్దని తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అలా అని చెప్పి ఓటు వేయవద్దని కాదు, కానీ వారు ఎవరికి ఓటు వేస్తారో తెలియదు కదా. కానీ ప్రచారంలో పాల్గొంటే మాత్రం ఎవరో ఒకరి వైపు ఉండాలి కనుక అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని మెగాస్టార్ భావించారట. అందుకనే ఆ కుటుంబం నుంచి ప్రచారంలో ఎవరూ పాల్గొనడం లేదని తెలుస్తోంది.
అయితే వారు కనిపించకపోవడంతో మెగా ఫ్యామిలీ ఈ విషయంలో చేతులెత్తేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ మెగాస్టార్ సపోర్ట్ మాత్రం ప్రకాష్ రాజ్కే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో చివరికి అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనేది.. ఉత్కంఠగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…