కార్తీక మాసంలో సాధారణంగా చాలా మంది రోజూ దీపారాధన చేస్తుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం వెలిగిస్తారు. ఇలా ఈ మాసం మొత్తం చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం కూడా కొందరు దీపారాధన చేస్తారు. ఇక కొందరు కార్తీక మాసం కాకపోయినా రోజూ దీపారాధన చేస్తూనే ఉంటారు. అయితే దీపారాధన చేసే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించి చేస్తే ఇష్టదైవం అనుగ్రహం లభిస్తుంది. దీపారాధన చేసే విషయంలో ఉండే ఆ నియమాలు ఏమిటంటే..
పంచలోహాలు, వెండి, మట్టి వంటి పదార్థాలతో తయారు చేసిన ప్రమిదల్లో మాత్రమే దీపం వెలిగించాలి. నిత్య పూజకు మట్టి ప్రమిదల కన్నా లోహపు ప్రమిదలు అయితే మంచిది. తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే మంచిది. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి మహాలక్ష్మిని స్మరించాలి. దీంతో కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. శనిగ్రహ దోష నివారణ అవుతుంది. అదే ఉత్తరం దిశగా దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటివి కలుగుతాయి. దక్షిణం వైపున దీపాన్ని వెలిగించరాదు. ఆ దిక్కున చనిపోయిన వారికి దీపం పెడతారు. కనుక ఆ వైపు దీపం పెట్టరాదు. పెడితే అన్నీ అపశకునాలే ఎదురవుతాయి. కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి.
ఇక దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులను వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. తెల్లని కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి ఆ తరువాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. మంచి జరుగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే.. ఎంతో శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు.
దీపం వెలిగించడానికి ఆవు నెయ్యిని వాడాలి. లేదా నువ్వుల నూనెను అయినా వాడుకోవచ్చు. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడితే ఆరోగ్యం మెరుగు పడుతుంది. 48 రోజుల పాటు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే పల్లి నూనెతో మాత్రం దీపారాధన చేయకూడదు. ఇలా పలు నియమాలను పాటిస్తే దైవం అనుగ్రహం కలుగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…