మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించమని స్వయంగా త్రివిక్రమే సంప్రదించినా ఒకప్పటి నటి యాక్సెప్ట్ చేయకపోవడం విశేషం. ఇంతకీ త్రివిక్రమ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయని నటి ఎవరనుకున్నారు.. లయ.. ఆవిడ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే..
అజ్ణాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నారు త్రివిక్రమ్. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులేశాడు. అందులో భాగంగానే ఒకప్పటి పరిచయంతో నటి లయను సంప్రదించారట. వీరిద్దరికీ ఎప్పుడు పరిచయం అంటే లయ మొదటి సినిమా స్వయంవరంకి త్రివిక్రమే రచయిత. లయని ఎన్టీఆర్ కి అత్తగా నటించాలని కోరారట త్రివిక్రమ్.
డైరెక్టర్ గారు.. నా వయస్సెంతో తెలుసా..? ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఎలా చేయగలను.. నాకు సినిమాల్లో బాగా గ్యాప్ వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటించినా మంచి క్యారెక్టర్ చేయాలి కానీ ఈ అత్త క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించిందట లయ. దీంతో త్రివిక్రమ్ బిక్క ముఖం వేశారట. ఇప్పటికే నదియా, ఖుష్భూ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు త్రివిక్రమ్ లయ దృష్టికి తీసుకెళ్ళారట. అదంతా నాకు తెలుసు.. కానీ నేను మీరు చెప్పే క్యారెక్టర్లో అస్సలు నటించలేను. దయచేసి క్షమించడంటూ సున్నితంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్ను తోసిపుచ్చిందట లయ. అందుకనే ఆమె అరవింద సమేత మూవీలో నటించలేదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…