Lijomol Jose : సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇందులోని కొన్ని పాత్రలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినతల్లి పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. సినతల్లి పాత్రలో జీవించింది లిజోమోల్ జోస్. జైభీమ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
తెలుగులో డబ్ అయిన సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ధి సినిమాతో టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చింది లిజోమోల్. జై భీమ్ మూవీలో లిజోమోల్ ఓ గిరిజన మహిళగా.. గర్భవతిగా నటించింది అందరితోనూ కన్నీళ్లు పెట్టించింది. సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఆ పాత్రను పోషించడానికి ఎంతో కష్టపడిందట.
జై భీమ్లో పాత్ర కోసం డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాను అని చెప్పింది. అలాగే తాను చేసింది గిరిజన స్త్రీ పాత్ర. అంత సులభంగా చేయలేం. కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను అని పేర్కొంది.
గిరిజనులు పాము కాటుకు ఎలా చికిత్స చేస్తారు. ఆ సమయంలో ఏ ఔషధాలను ఉపయోగిస్తారనే విషయాలను కూడా వారి నుంచి తెలుసుకున్నాను. అంతే కాకుండా.. వారితో కలిసి ఎలుకలు పట్టడానికి కూడా వెళ్లి, వారెలా పడుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓసారి ఎలుక మాంసం కూడా రుచి చూశాను, చికెన్ తిన్నట్టే అనిపించింది.. అని తెలిపింది లిజోమోల్ జోస్.
అయితే జైభీమ్ చిత్రానికి మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను ఈ మూవీపై వివాదాలు ఎక్కువయ్యాయి. ఒక సీన్లో ప్రకాష్ ఓ వ్యక్తిని స్థానిక భాష మాట్లాడలేదని చెంప చెళ్లుమనిపిస్తాడు. ఈ సీన్పై వివాదం రాజుకుంది. దీంతో ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. హిందీని అవమానించడం తమ ఉద్దేశం కాదని, ఆ సీన్ యాదృచ్ఛికంగానే వచ్చిందని చెప్పారు.
తరువాత తమిళనాడుకు చెందిన ఓ సంఘం వారు తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ సూర్యపై, జైభీమ్ యూనిట్పై పరువు నష్టం కేసు వేశారు. అయితే వివాదాల మాట ఎలా ఉన్నప్పటికీ జై భీమ్ మాత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సమాజంలో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మూవీకి పబ్లిసిటీ కూడా బాగానే లభించిందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…