Lijomol Jose : సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇందులోని కొన్ని పాత్రలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినతల్లి పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. సినతల్లి పాత్రలో జీవించింది లిజోమోల్ జోస్. జైభీమ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
తెలుగులో డబ్ అయిన సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ధి సినిమాతో టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చింది లిజోమోల్. జై భీమ్ మూవీలో లిజోమోల్ ఓ గిరిజన మహిళగా.. గర్భవతిగా నటించింది అందరితోనూ కన్నీళ్లు పెట్టించింది. సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఆ పాత్రను పోషించడానికి ఎంతో కష్టపడిందట.
జై భీమ్లో పాత్ర కోసం డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాను అని చెప్పింది. అలాగే తాను చేసింది గిరిజన స్త్రీ పాత్ర. అంత సులభంగా చేయలేం. కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను అని పేర్కొంది.
గిరిజనులు పాము కాటుకు ఎలా చికిత్స చేస్తారు. ఆ సమయంలో ఏ ఔషధాలను ఉపయోగిస్తారనే విషయాలను కూడా వారి నుంచి తెలుసుకున్నాను. అంతే కాకుండా.. వారితో కలిసి ఎలుకలు పట్టడానికి కూడా వెళ్లి, వారెలా పడుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓసారి ఎలుక మాంసం కూడా రుచి చూశాను, చికెన్ తిన్నట్టే అనిపించింది.. అని తెలిపింది లిజోమోల్ జోస్.
అయితే జైభీమ్ చిత్రానికి మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను ఈ మూవీపై వివాదాలు ఎక్కువయ్యాయి. ఒక సీన్లో ప్రకాష్ ఓ వ్యక్తిని స్థానిక భాష మాట్లాడలేదని చెంప చెళ్లుమనిపిస్తాడు. ఈ సీన్పై వివాదం రాజుకుంది. దీంతో ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. హిందీని అవమానించడం తమ ఉద్దేశం కాదని, ఆ సీన్ యాదృచ్ఛికంగానే వచ్చిందని చెప్పారు.
తరువాత తమిళనాడుకు చెందిన ఓ సంఘం వారు తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ సూర్యపై, జైభీమ్ యూనిట్పై పరువు నష్టం కేసు వేశారు. అయితే వివాదాల మాట ఎలా ఉన్నప్పటికీ జై భీమ్ మాత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సమాజంలో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మూవీకి పబ్లిసిటీ కూడా బాగానే లభించిందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…