Liger Movie : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలై ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి భారీ నష్టాలను మూటకట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు లైగర్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా డిజిటల్ రిలీజ్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైగర్ సినిమా సెప్టెంబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
వాస్తవానికి ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి కానీ సినిమా ఫ్లాప్ అవడంతో.. హాట్స్టార్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసిందట. అందుకే లైగర్ ముందుగానే ఓటీటీలోకి వస్తుందట. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ చిత్రాన్ని కరణ్జోహర్, ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా రూ.30 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి మేకర్స్కు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. థియేటర్ లలో నిరుత్సాహపరిచిన లైగర్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…