Kriti Sanon : కృతి సనన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీతో తెలుగుప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. ఈ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నది. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది కృతి. ప్రస్తుతం ప్రభాస్తో ఆదిపురుష్ లో సీతగా నటిస్తున్న కృతి సనన్ తెగ సందడి చేస్తోంది. బాలీవుడ్లో అలరిస్తున్న కృతి సనన్ ఫొటో షూట్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.
తెలుగులో రెండు సినిమాల్లో మెరిసిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. బచ్చన్ పాండే, షేహజాదా, బేదియా, గణపత్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. వీటితోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇదిలా ఉండగా కృతి సనన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కసరత్తులకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో అనేక రకాల వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.
జిమ్లో కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉండే కృతి.. తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ హీరోయిన్ అయ్యింది తెలుగు సినిమాతోనే. 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. భారీ అంచలనాల మధ్య విడుదలైన నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ మూవీ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. కాలేజ్ స్టూడెంట్ గా కృతి అదరగొట్టింది. ఈ సినిమా సైతం ఆమెకు హిట్ ఇవ్వలేదు. కృతి గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. హిట్ దక్కకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…