Kriti Sanon : కృతి సనన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీతో తెలుగుప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. ఈ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నది. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది కృతి. ప్రస్తుతం ప్రభాస్తో ఆదిపురుష్ లో సీతగా నటిస్తున్న కృతి సనన్ తెగ సందడి చేస్తోంది. బాలీవుడ్లో అలరిస్తున్న కృతి సనన్ ఫొటో షూట్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.
తెలుగులో రెండు సినిమాల్లో మెరిసిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. బచ్చన్ పాండే, షేహజాదా, బేదియా, గణపత్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. వీటితోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇదిలా ఉండగా కృతి సనన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కసరత్తులకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో అనేక రకాల వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.
జిమ్లో కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉండే కృతి.. తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ హీరోయిన్ అయ్యింది తెలుగు సినిమాతోనే. 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. భారీ అంచలనాల మధ్య విడుదలైన నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ మూవీ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. కాలేజ్ స్టూడెంట్ గా కృతి అదరగొట్టింది. ఈ సినిమా సైతం ఆమెకు హిట్ ఇవ్వలేదు. కృతి గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. హిట్ దక్కకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…