Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో కృతి శెట్టికి మంచి ఫేమ్ వచ్చింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అయితే ఇప్పుడు కృతికి తిరోగమనం మొదలైనట్లు అనిపిస్తుంది.
కృతిశెట్టి నటించిన ది వారియర్ మూవీ ఫ్లాప్ అయ్యింది. అలాగే మొన్న విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారు. అలాగే ఇటీవల విడుదలైన సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్ టాక్ నడుస్తుంది. దీంతో కృతిశెట్టి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్టైంది. మొదటి మూడు చిత్రాల విడుదల తర్వాత కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది ఈ అమ్మడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.
సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతి కెరియర్ ఇబ్బందుల్లో పడింది. కాకపోతే రీసెంట్గా ప్రెస్ మీట్ లో కృతి మాట్లాడుతూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇద్దామనుకుంటున్నాను అంటూ ఆమె చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మూడు ఫ్లాప్ లు పడగానే ఇంత దిగులా.. కృతి నీ మైనస్లలకు కారణం స్టోరీ ఎంపిక.. మంచి స్టోరీస్ ఎంచుకో అంటూ బూస్టప్ ఇస్తున్నారు అభిమానులు. మరి అభిమానుల మాట వింటుందో లేదో.. చూడాలి.
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…