Krishnam Raju Sabha : అతిథి మర్యాదలకు పెట్టింది పేరైన కృష్ణం రాజు ఫ్యామిలీలో ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన పెదనాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా అతిథి మర్యాదల్లో కూడా ఆయన ఆనవాయితీలను పాటిస్తున్నారని అందరూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు. ఈ మధ్యే కృష్ణం రాజు మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన సొంత ఊరైన మొగల్తూరులో ఎంతో మంది ఆయన మరణం పట్ల బాధలో ఉన్నారని తెలిసింది.
ఈ క్రమంలోనే ఎప్పుడూ తన ఊరు వెళ్లని ప్రభాస్ కూడా అతని పెదనాన్న జ్ఞాపకార్థం ఆయన సంస్మరణ సభను ఏర్పాటు చేసి అభిమానులను ఓదార్చడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రభాస్ అక్కడి అభిమానులకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతుంది. తన మర్యాదలతో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసే ప్రభాస్ ఇప్పుడు తనేంటో మరొక్కసారి నిరూపిస్తున్నాడని అంటున్నారు.
ఈ సభకు హాజరయ్యే అభిమానుల కోసం ప్రభాస్ భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టన్నుల కొద్దీ మటన్, చికెన్, చేపలు, రొయ్యలు ఇంకా వివిధ రకాల వంటలతో ఎటువంటి లోటు రాని విధంగా చేయనున్నారని సమాచారం అందుతుంది. దాదాపు లక్ష మందికి వంటలు సిద్దం చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగాగానే భారీ ఎత్తున పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు చేస్తున్న వీడియోలు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్ని ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులందరూ ఈ విందు గురించి చాలా గొప్పగా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా రాజుల కుటుంబానికి చెందిన ప్రభాస్ వ్యక్తిత్వంలోనూ రాజుననే నిరూపిస్తున్నాడని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…