Krishnam Raju Sabha : అతిథి మర్యాదలకు పెట్టింది పేరైన కృష్ణం రాజు ఫ్యామిలీలో ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన పెదనాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా అతిథి మర్యాదల్లో కూడా ఆయన ఆనవాయితీలను పాటిస్తున్నారని అందరూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు. ఈ మధ్యే కృష్ణం రాజు మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన సొంత ఊరైన మొగల్తూరులో ఎంతో మంది ఆయన మరణం పట్ల బాధలో ఉన్నారని తెలిసింది.
ఈ క్రమంలోనే ఎప్పుడూ తన ఊరు వెళ్లని ప్రభాస్ కూడా అతని పెదనాన్న జ్ఞాపకార్థం ఆయన సంస్మరణ సభను ఏర్పాటు చేసి అభిమానులను ఓదార్చడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రభాస్ అక్కడి అభిమానులకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతుంది. తన మర్యాదలతో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసే ప్రభాస్ ఇప్పుడు తనేంటో మరొక్కసారి నిరూపిస్తున్నాడని అంటున్నారు.
ఈ సభకు హాజరయ్యే అభిమానుల కోసం ప్రభాస్ భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టన్నుల కొద్దీ మటన్, చికెన్, చేపలు, రొయ్యలు ఇంకా వివిధ రకాల వంటలతో ఎటువంటి లోటు రాని విధంగా చేయనున్నారని సమాచారం అందుతుంది. దాదాపు లక్ష మందికి వంటలు సిద్దం చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగాగానే భారీ ఎత్తున పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు చేస్తున్న వీడియోలు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్ని ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులందరూ ఈ విందు గురించి చాలా గొప్పగా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా రాజుల కుటుంబానికి చెందిన ప్రభాస్ వ్యక్తిత్వంలోనూ రాజుననే నిరూపిస్తున్నాడని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…