Brahmastra Movie : ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతూ వస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. రణ్బీర్ కపూర్, అలియా భట్, అక్కినేని నాగార్జున.. ఇలా ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ వుంది. పైగా జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పించాడు. అలాగే సినిమాను తనదైన స్టయిల్లో ప్రమోట్ చేశాడు.
దీంతో బ్రహ్మాస్త్ర మూవీ బాలీవుడ్ కు కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. అన్నీ భాషల్లోనూ మంచి కలెక్షన్లను రాబట్టి ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది. గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
విడుదలైన నెల రోజులకే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 3వ వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. థియేటర్లలో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. అలాగే త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…