Koratala Siva : రచయిత నుండి దర్శకుడిగా మారి హిట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఆచార్య పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కొరటాల శివ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబోలో మూవీ రాబోతుంది. వీలైనంత తొందరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే నెలలో ఎన్టీఆర్ మినహా.. మిగతా షూటింగ్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ చేయనున్నారట. అయితే కొరటాల నుండి త్వరలో ఓ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.
బాలకృష్ణ, మహేష్ బాబులతో కొరటాల శివ ఓ మల్టీ స్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.
అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇది పూర్తైన వెంటనే బాలకృష్ణ – కొరటాల చిత్రం పట్టాలెక్కనుందని, ఇందులో మహేష్ బాబు కూడా కనిపించనున్నారని సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…