Kiara Advani : 2014లో ఫుగ్లీ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తర్వాత సుశాంత్ రాజ్ పూత్ హీరోగా నటించిన ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో ధోనీ భార్యగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. 2018లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్ ను అందుకుని హీరో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
అయితే వినయ విధేయ రామ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో మరలా తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్న Rc15 లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ Rc15 చిత్రానికి సర్కారోడు పేరు పెట్టినట్లు వార్త వినిపిస్తోంది.
ఈ బ్యూటీ తాజాగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీళ్లిద్దరూ సీక్రెట్ గా కాపురం పెట్టేశారు అనే టైంలో బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఇటీవలే లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా వీరిద్దరి రిలేషన్ షిప్ పై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా కియారా అద్వానీ తన 30వ పుట్టిన రోజును దుబాయ్ లో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలలో కియారా అద్వానీతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. వీళ్ల బ్రేకప్ విషయంలో నిజమెంతో తెలియాలంటే, ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. అప్పుడు గానీ అందరిలో ఉన్న ఈ సస్పెన్స్ కి బ్రేక్ పడదు. మరి వీరిద్దరూ ఏం చేస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…