Keerthy Suresh : సూపర్స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్గా చిత్రీకరణ పూర్తి చేసుకొని మే 12న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం బిజీ అయ్యింది. తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మర్చిపోయి.. రెండు సార్లు మిస్ టైమింగ్ తో మహేష్ ను కొట్టినట్లు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే మూడో సారి దానికి సారీ చెప్పానని.. అయితే మూడోసారి కూడా పొరపాటున కొట్టినట్లు చెప్పింది. దీని తర్వాత నాపై కోపం ఏమైనా ఉందా ? అని మహేశ్ సరదాగా అడిగారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. మహేష్ షూటింగ్లో చాలా సరదాగా ఉంటారనే సంగతి తెలిసిందే. తన తోటి ఆర్టిస్టులతో జోకులు చేస్తూ సరదాగా షూటింగ్ లో పాల్గొంటారు.
హాఫ్ స్క్రీన్లో మహేశ్ బాబు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందని కీర్తి సురేష్ని అడగ్గా.. ఆయనతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుందని కీర్తి సురేష్ పేర్కొంది. సర్కారు వారి పాట మూవీపై పూర్తి పాజిటివ్ బజ్ నడుస్తోంది. అదే సమయంలో మహేష్ ఫ్యాన్స్ ని మరో భయం వెంటాడుతుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న మహేష్ కి కీర్తి సురేష్ కారణంగా ప్లాప్ పడితే పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు. ప్లాప్స్ లో ఉన్న కీర్తి తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మహేష్ కి కూడా ప్లాప్ ఇస్తుందేమోనని కంగారు పడుతున్నారు. మరోవైపు మే నెలలో విడుదలైన మహేష్ సినిమాలు ఫ్లాపుల బాట పట్టగా, ఇది కూడా అభిమానులని కలవర పెడుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…