Karthikeya 2 : చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 ఎవరూ ఊహించని విధంగా హీరో నిఖిల్ కెరీర్ లోనే అతి భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఎంతో వేగంగా రూ.100 కోట్ల వసూళ్ల మైలురాయిని కూడా దాటేసింది. అభిషేక్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లు హీరో హారోయిన్లుగా నటించగా చందూ మొండేటి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. ఆయన కారెక్టర్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీ కృష్ణుడి కాలానికి చెందిన ఒక రహస్యాన్ని ఛేదించే క్రమంలో కథానాయకుడు చేసిన సాహసాలు అందరినీ అబ్బుర పరుస్తాయి. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడికి చెందినదిగా భావించే ఒక అమూల్యమైన సంపదను కాపాడటానికి హీరో బయలుదేరతాడు. అది కలియుగంలో మానవులకు దిక్సూచిగా చెప్పబడుతుంది. ఈ క్రమంలో అతనికి ఎన్నో దుష్ట శక్తులు ఎదురవుతాయి. ఈ ప్రయాణంలో అతను శ్రీ కృష్ణుడి గొప్పదనాన్ని కూడా తెలుసుకుంటాడు.
ఇక అన్ని చిత్రాల లాగానే ఈ సినిమా కూడా విడుదలైన 45 రోజుల తరువాత ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో సెప్టెంబర్ 30 నుండి ప్రసారం కానుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
ఇక ఆగస్టు 13న విడుదలైన కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఇది ఆయన సినీ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్నో పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ముందు నిలవలేకపోవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా రూ.120 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకా చాలా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…