Karthikeya 2 : ప్రస్తుతం ఎక్కడ చూసినా కార్తికేయ-2 మానియానే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే కలెక్షన్లకు తిరుగుండదని మరోసారి నిరూపించింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధిస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్లో రోజు రోజుకూ కార్తికేయ-2పై క్రేజ్ పెరిగిపోతోంది. కార్తికేయ-2 చిత్రం బాలీవుడ్లో మొదటి రోజు కేవలం 60 స్క్రీన్లలో విడుదలైంది. ఇక రెండో రోజు ఏకంగా 300 స్క్రీన్లకు పెరిగింది. దీనికి పోటీగా అమీర్ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ వంటి సినిమాలున్నా బాలీవుడ్ ప్రేక్షకులు కార్తికేయ-2 చిత్రం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.
ఈవారం వచ్చే కృష్ణాష్టమికి ఈ సినిమా పీక్స్కి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రం కావడంతో హిందూ అనుకూల ప్రేక్షకులు ఈ కాన్సెప్ట్ని ఆదరించి థియేటర్లకు తరలి వస్తున్నారు. ఈ సినిమా మరికొన్ని వారాలు మంచి ఆక్యుపెన్సీలతో రన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశంలో సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీకి కూడా ఇదే విధమైన స్పందన లభించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆ చిత్రం కూడా హిందూత్వ వేవ్ పై 2022లో సూపర్ హిట్ గా నిలిచింది. కాబట్టి కార్తికేయ 2 కూడా మినీ కాశ్మీర్ ఫైల్స్ గా మారుతోంది అంటున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరోసారి జాక్పాట్ కొట్టారు. అలాగే నిఖిల్ ఈ సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇకముందు నిఖిల్ కి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 భారీ హిట్ అవడంపై చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…