వరుస చిత్రాలు ఫ్లాప్ అవుతుండడంతో ఈసారి తీసే సినిమా అలా కాకూడదని చెప్పి.. నందమూరి కల్యాణ్ రామ్ తీసిన మూవీ.. బింబిసార. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్తోనే చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. కల్యాణ్ రామ్ కెరీర్లో ఈ మూవీ ఒక మైలు రాయిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్పై కల్యాణ్ రామ్ స్వయంగా రూ.37 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ను కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చేపడుతున్నారు.
బింబిసార మూవీలో క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్స్లో నటిస్తుండగా.. మరో పాత్రలో వరీనా హుస్సేన్ నటిస్తోంది. అలాగే వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు మంచి టాక్ను తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే కీస్త్రు శకం 5వ శతాబ్దం నాటి మగధ రాజు బింబిసారుడి కథాంశంతో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఎంతగానో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ మూవీ ఆగస్టు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ఈ మూవీకి గాను ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు. ప్రముఖ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.. బింబిసార మూవీని చూసి ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీ చాలా బాగుందని.. కళ్యాణ్రామ్ కు మంచి హిట్ మూవీ అవుతుందని.. టాలీవుడ్కు మంచి పేరు వస్తుందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్లో మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ఈ మూవీలో చాలా భాగం వరకు గ్రాఫిక్స్తోనే సీన్లను తీశారట. అలాగే ఆదిత్య 369 మూవీలా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. దీంతో సినిమా హిట్ పక్కా అని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర ఫలితం ఏమిటో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ క్రమంలోనే సినిమా కోసం అటు నందమూరి ఫ్యాన్స్తోపాటు ఇటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…