Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్లో మంచి ఫామ్లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్ ఇపుడు వరుసగా సినిమాలు చేయడానికీ ఓకే చెబుతోంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని.. బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాగా.. రూపొందించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాజల్ కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఫేమస్ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. సినిమాలో హీరోయిన్ గా కాదు కానీ సినిమాలో ఓ మెయిన్ క్యారెక్టర్ కోసం కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసుకున్నారట. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా స్టోరీ విన్న కాజల్ అగర్వాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోందట. హీరో కూడా కొత్తవాడే కానీ కథ మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూనే తిరుగుతుందట. ఇంకా చెప్పాలంటే సినిమాకి మెయిన్ హీరో.. హీరోయిన్ అన్నీ కాజల్ అన్నమాట. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ కు ఈ సినిమానే కరెక్ట్ అని కాజల్ వెంటనే సైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాజల్ మళ్లీ రీఎంట్రీ ఇస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూడాలి ఈ సినిమా కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత పెద్ద హిట్ అవుతుందో..!
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…