Fish : సాధారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులకు కొన్నిసార్లు ఎంతో అరుదైన, ఖరీదైన చేపలు వలలో చిక్కుతుంటాయి. ఇలా ఖరీదైన చేపలు పడినప్పుడు ఒక్కసారిగా మత్స్యకారులు లక్షాధికారులు అవుతారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడు కూడా ఇలాగే లక్షాధికారిగా మారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేప లభించడంతో దానిని వేలంలో పెట్టారు.
ఈ క్రమంలోనే బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఈ కచ్చిడి చేపను బంగారు చేప అని కూడా పిలుస్తారు. ఈ విధంగా బంగారు వర్ణంతో ఉన్న 25 కిలోల చేపను ఏకంగా రూ.2.90 లక్షలకి ఓ పాట దారుడు దక్కించుకున్నాడు. ఇంత ఖరీదు చేసే ఈ చేప ప్రత్యేకతలు ఏమిటి అనే విషయానికి వస్తే..
ఈ చేపలలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల బలం కోసం ఉపయోగించే మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. అదే విధంగా గాల్ బ్లాడర్ కు ఆపరేషన్ చేసే సమయంలో కుట్లు వేయడం కోసం ఉపయోగించే దారం తయారీలోనూ ఈ చేపను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఖరీదైన వైన్ తయారు చేసే సమయంలో ఈ చేపలోని పలు భాగాలను ఉపయోగించడం వల్ల ఈ చేపకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. అందుకనే ఈ చేప అంతటి ధర పలికింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…