Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు అటు పొలిటికల్గా, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా మారింది. స్టార్ ఇమేజ్ ఉన్న తారక్కి బీజేపీ అగ్రనేతలతో ఏంటీ సంబంధం అనే చర్చ జరుగుతోంది. ఏపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నానికి ప్రత్యేకమైన అభిమానం. టాలీవుడ్లో ఎన్టీఆర్, కొడాలి, వల్లభనేని వంశీ ఫ్రెండ్షిప్ గురించి అప్పట్లో అందరూ చెప్పుకునేవారు.
ఇక అప్పుడప్పుడూ ఎన్టీఆర్ సినిమా సెట్లో నాని, వంశీ సందడి చేసేవారు. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ తో కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్ని కారణాల వల్ల విభేదాలు తలెత్తి వీరు విడిపోయారు. అయితే ఇటీవల ఎన్టీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేకపోతే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవరినీ కలవరని కొడాలి నాని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసి అభిమానులు, నెటిజన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లైక్స్, షేర్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
అందులో కొడాలి నాని మధ్యలో కూర్చుని సీరియస్గా పుస్తకంలో ఏదో చూస్తుండగా.. ఎన్టీఆర్ నవ్వుతూ నాని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. అలాగే మరోవైపు వల్లభనేని వంశీ సైతం నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటో సుబ్బు సినిమా షూటింగ్ గ్యాప్లో తీసిన ఫోటోలా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని, ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. రాజకీయం ఎంతటి మిత్రుల మధ్యనైనా వైరం పెంచుతుంది. ఇప్పుడు వీరిద్దరూ చెరో దారిలో వెళ్తున్నారు. ప్రస్తుతం తారక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…