Jr NTR Watch : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమరం భీంగా ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. . డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పై సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటు , తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం విజయం సాధించిన కారణంగా చిత్ర యూనిట్ అనేక సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. అయితే హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్టీఆర్ కి కార్లు, వాచ్లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ తారక్ పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఇటీవల జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో అతడు ధరించిన వాచ్పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్గా ఉండడంతో.. దీని ధర ఎంత ఉంటుందబ్బా.. అని సెర్చ్ చేస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో దాని విలువ కనిపించింది . ఆ వాచ్ ధర 5,14,800 డాలర్లు అని తెలిసింది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు. ఏంటి ధరించిన వాచ్ ఖరీదు అంత అని అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు ఏంటి ఈ వాచ్ ప్రత్యేకత అనే విషయానికి వెళ్తే..ఈ వాచ్ రిచర్డ్ మిల్లే ఆర్ఎమ్ కు చెందిన 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ వాచ్ అది. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్లతో ఇది కూడా ఒకటి. ఎన్టీఆర్ ఎంతో ఇష్టంతో ఈ వాచ్ కొలుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు కూడా ఉన్నట్లు సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…