Jr NTR : నయనతార, విగ్నేశ్ శివన్ జోడీకి కవల పిల్లలు పుట్టారనే వార్త ఒక్కసారిగా వైరల్ అవుతోంది. విగ్నేశ్ శివన్ ఈ మేరకు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమకు ట్విన్స్ పుట్టారంటూ, పండంటి బిడ్డలు పుట్టారని విగ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అందులో నయన్, విగ్నేశ్లు తమ బిడ్డల పాదాలను ముద్దాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం ఇంకోలా రియాక్ట్ అవుతున్నారు. దానికి కారణం మనందరికీ తెలిసిందే. పెళ్లయిన 4 నెలలకే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
అది సరోగసి ప్రాసెస్ అని అందరికీ తెలిసినా.. పెళ్ళికి ముందే ఇలా ఎలా చేయగలరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. నయనతార టాలీవుడ్ యంగ్ హీరో తారక్ తో కలిసి అదుర్స్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. చారిగా తారక్ అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ సీన్ ఉంటుంది మీకు గుర్తొచ్చింది కదా.
ఈ సీన్లో నయనతార ఫ్రెండ్ తో బెట్ వేసి స్విమ్మింగ్ పూల్ లో కి దూకగా ఎన్టీఆర్ సూసైడ్ చేసుకోబోతుందని కష్టపడి తన ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. అయితే అది బెట్ అనే సంగతి తారక్ కి తెలియదు. ఈ క్రమంలోనే తారక్, నయనతార మధ్య వచ్చే సీన్లో.. మీకు కవల పిల్లలు పుడతారండి.. మీకు అక్కడ పుట్టు మచ్చ ఉంది అంటాడు. దీంతో వెంటనే నయనతార షాక్ అయిపోయాయి ఛీ ఛీ అంటూ సీన్ కట్ చేస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ చెప్పినట్టే నిజంగా నయనతారకు కవల పిల్లలు పుట్టారు. ఈ కో ఇన్సిడెన్స్ ఏంటో అద్భుతంగా ఉంది కదూ అంటూ కొందరు ఫ్యాన్స్ ఆ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్టులో నయన్ కూడా చేరినట్టు అయింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…