బీహార్లో ఇటీవలి కాలంలో కొందరి బ్యాంకు అకౌంట్లలో కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ అయిన విషయం విదితమే. అయితే ఆయా సంఘటనలపై ఇప్పటికీ విచారణ చేస్తున్నారు. డబ్బులు అంత పెద్ద మొత్తంలో పలువురి అకౌంట్లలో ఎందుకు దర్శనమిస్తున్నాయో ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. అయితే తాజాగా ఇంకో వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే..
బీహార్లోని సుపౌల్ టౌన్లో ఉన్న సిసౌనీ అనే ప్రాంతంలో విపిన్ చౌహాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల అతను స్థానికంగా ఉన్న ఓ కస్టమర్ సర్వీస్ పాయింట్కు వెళ్లి ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే అతని ఆధార్ నంబర్ చెక్ చేసిన ఉద్యోగులు దానికి ఓ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ అకౌంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అయితే దాన్ని తాను ఓపెన్ చేయలేదని, అసలు తనకు బ్యాంకు అకౌంట్ లేదని అతను చెప్పాడు. దీంతో అధికారులు ఖంగు తిన్నారు.
ఇక ఆ అకౌంట్ను అక్టోబర్ 13, 2016లోనే ఓపెన్ చేయగా.. అందులో పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించారు. కోట్ల రూపాయల లావాదేవీలు అందులో జరిగాయి. కానీ ఆ అకౌంట్ ఎలా ఏర్పాటు అయింది ? అని వివరాలు వెతికారు. కానీ ఏమీ లభ్యం కాలేదు. ఇక అందులో పెద్ద మొత్తంలో లావాదేవీలు మాత్రం జరిగాయి. అలాగే ప్రస్తుతం ఆ అకౌంట్లో రూ.9.99 కోట్లు ఉన్నాయి. దీంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…