దేశవ్యాప్తంగా మూడో దశ కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి టీకాలను ఇస్తున్నారు. అయితే పలు రాష్ట్రాలు టీకాల నిల్వలు తగ్గుతున్నాయని, వెంటనే డోసులను పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో స్పందించిన కేంద్రం టీకాలను అయిపోయిన వెంటనే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్నప్పటికీ కొందరికి కరోనా సోకుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో నిపుణులు తెలియజేస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్నా కొందరికి కోవిడ్ సోకడంపై వైద్య నిపుణులు పలు కారణాలను చెబుతున్నారు. వ్యాక్సిన్ సరిగ్గా వేయకపోయినా, నిర్ణీత డోసు వేయకపోయినా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా కోవిడ్ సోకుతుంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ సందర్భాల్లో కోవిడ్ సోకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ కోవిడ్ వ్యాక్సిన్ కూడా 100 శాతం కోవిడ్ నుంచి రక్షణను అందించవు. అందువల్ల కూడా కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత కొందరు కోవిడ్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకునేందు కన్నా ముందుగానే ఎవరికైనా కోవిడ్ ఉంటే వ్యాక్సిన్ తీసుకుని కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు కోవిడ్ తగ్గాక వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత కోవిడ్ సోకుతోంది. అయితే టీకా తీసుకున్న తరువాత కూడా కరోనా జాగ్రత్తలను పాటించడం వల్ల కోవిడ్ సోకకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…