దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శనివారం కొత్తగా 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య కూడా ఇదే కావడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరుకుంది. కాగా కరోనా ప్రభావం దేశంలో మొదలైనప్పటి నుంచి రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 1 లక్ష మార్కును దాటడం ఇది 5వ సారి. ఏప్రిల్ 5వ తేదీన 1,03,558 కోవిడ్ కేసులు నమోదు కాగా, 7న 1,15,736 కేసులు నమోదయ్యాయి. అలాగే ఏప్రిల్ 8వ తేదీన 1,26,789 కేసులు, 9వ తేదీన 1,31,968 కేసులు నమోదయ్యాయి.
శనివారంతో దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆ సంఖ్య 10,46,631కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 794 మంది చనిపోయారు.
గత సెప్టెంబర్ నెల తరువాత దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటడం మళ్లీ ఇదే తొలిసారి. సెప్టెంబర్ 20, 2020వ తేదీన 10 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 77,567 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…