గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించే కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో మహోబా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకం కింద ఉజ్వల 2.0 ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లతోపాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ ప్లేట్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో చేరడానికి సరైన ఆధారాలు అవసరమే. కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన వారికి ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా గ్యాస్ కనెక్షన్లను అందించనుంది.
ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే1, 2016న ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. ఎవరైతే దారిద్ర్యరేఖకు దిగువన ఉంటారో అలాంటి మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మొదటిదశలో భాగంగా 1,47,43,862 LPG కనెక్షన్లను తీసుకున్నారు. అయితే ఈ పథకానికి ఏవిధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు విషయానికి వస్తే.. కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. ఈ మహిళలు తప్పనిసరిగా దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఇంట్లో ఏ కుటుంబ సభ్యులకి కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…