గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించే కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో మహోబా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకం కింద ఉజ్వల 2.0 ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లతోపాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ ప్లేట్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో చేరడానికి సరైన ఆధారాలు అవసరమే. కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన వారికి ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా గ్యాస్ కనెక్షన్లను అందించనుంది.
ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే1, 2016న ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. ఎవరైతే దారిద్ర్యరేఖకు దిగువన ఉంటారో అలాంటి మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మొదటిదశలో భాగంగా 1,47,43,862 LPG కనెక్షన్లను తీసుకున్నారు. అయితే ఈ పథకానికి ఏవిధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు విషయానికి వస్తే.. కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. ఈ మహిళలు తప్పనిసరిగా దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఇంట్లో ఏ కుటుంబ సభ్యులకి కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…