దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రతిరోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్లోని రెండు గ్రామాలలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
గుజరాత్ లోని షియాల్, అలియా అనే రెండు గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందుకు గల కారణం ఆ గ్రామస్తులు పాటిస్తున్నటువంటి జాగ్రత్తలు. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాలలో కరోనా కేసులు అధికమవుతున్న ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం. ఈ రెండు గ్రామాల సర్పంచులు గ్రామ ప్రజల పట్ల తీసుకున్న బాధ్యత దీనికి కారణం అని చెప్పవచ్చు.
గత సంవత్సరం నుంచి ఈ రెండు గ్రామాలలోకి ఇతర వ్యక్తులు ఎవరిని లోపలికి అనుమతించలేదు, అదే విధంగా గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలి. అలాగే క్రమం తప్పకుండా ఊరు మొత్తం శానిటైజ్ చేయటం వల్ల ఈ రెండు గ్రామాలలో ఇప్పటివరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బయట వ్యక్తులు మాత్రమే కాకుండా ఈ గ్రామంలోని ప్రజలు కూడా ఎవరు బయటకు వెళ్లకూడదు అనే ఆంక్షలను విధించారు.
ఈరెండు గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైన పరిస్థితులలో సర్పంచ్ అనుమతి తీసుకుని బయటకు వెళ్లాలి.బయటనుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు తమ ఇంటికి కాకుండా క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలి. ఈ విధంగా ఈ రెండు గ్రామాల సర్పంచులు వారి గ్రామ ప్రజల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, బాధ్యతనే ఇప్పటివరకు ఈ రెండు గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…