దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రతిరోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్లోని రెండు గ్రామాలలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
గుజరాత్ లోని షియాల్, అలియా అనే రెండు గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందుకు గల కారణం ఆ గ్రామస్తులు పాటిస్తున్నటువంటి జాగ్రత్తలు. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాలలో కరోనా కేసులు అధికమవుతున్న ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం. ఈ రెండు గ్రామాల సర్పంచులు గ్రామ ప్రజల పట్ల తీసుకున్న బాధ్యత దీనికి కారణం అని చెప్పవచ్చు.
గత సంవత్సరం నుంచి ఈ రెండు గ్రామాలలోకి ఇతర వ్యక్తులు ఎవరిని లోపలికి అనుమతించలేదు, అదే విధంగా గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలి. అలాగే క్రమం తప్పకుండా ఊరు మొత్తం శానిటైజ్ చేయటం వల్ల ఈ రెండు గ్రామాలలో ఇప్పటివరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బయట వ్యక్తులు మాత్రమే కాకుండా ఈ గ్రామంలోని ప్రజలు కూడా ఎవరు బయటకు వెళ్లకూడదు అనే ఆంక్షలను విధించారు.
ఈరెండు గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైన పరిస్థితులలో సర్పంచ్ అనుమతి తీసుకుని బయటకు వెళ్లాలి.బయటనుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు తమ ఇంటికి కాకుండా క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలి. ఈ విధంగా ఈ రెండు గ్రామాల సర్పంచులు వారి గ్రామ ప్రజల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, బాధ్యతనే ఇప్పటివరకు ఈ రెండు గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…