సోషల్ మీడియా.. ఈ మీడియా ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఈ సోషల్ మీడియాను ఉపయోగించి ఎంతో మంది ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి అవగాహనలను కలుగజేయవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవగాహన కలిగి చేసే విషయంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ప్రజల్లో ట్రాఫిక్,సైబర్ నేరగాళ్ల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన పోస్టులను చేస్తుంటారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్ పోలీసులు ఏకంగా మహేష్ బాబు సినిమా డైలాగ్ లను వాడుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం మాత్రమే. ఇందులో భాగంగానే మాస్క్ ధరించడం అవసరాన్ని వివరిస్తూ మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ సినిమాలోని డైలాగులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. ఈ వీడియోలో “జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు, బి అలర్ట్.. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.. మాస్కు ధరించండి” అనే డైలాగ్ లను పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా కరోనా బారిన పడినవారికి ప్లాస్మా దానం ఎంత అవసరమో మనకి తెలిసినదే. అయితే ఇప్పుడు ఆ అవసరం మరింత పెరిగింది. ప్లాస్మా దానం చేయాలని గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన వీడియోను మహేష్ బాబు షేర్ చేస్తూ… కరోనాతో పోరాడుతున్న వారికి మనకు చేతనైన సహాయం చేద్దాం.. గతంలో కంటే ప్రస్తుతం ప్లాస్మా దానం ఎంతో అవసరం, హైదరాబాద్ పోలీసులకు కమిషనర్ సజ్జనార్ తీసుకున్న చొరవకు నా మద్దతు ఉంటుందని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…