కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారిన పడే చనిపోతుండగా మరి కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఈ విధంగా కరోనా సోకి మృతి చెందిన వారికి దహన సంస్కరణలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను కడసారి చూడలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని కరోనాతో చనిపోయిన తండ్రి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా తన తండ్రి మరణం తట్టుకోలేక ఆ కూతురు చితి మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
రాజస్థాన్లోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో దామోదర్ దాస్ మరణించాడు. ఈ క్రమంలోనే అతని మృతదేహానికి పంచాయతీ సిబ్బంది, తమ కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే దామోదర్ దాస్ చితికి నిప్పటించిన వెంటనే అతడి కుమార్తె శారద చితిపైకి దూకేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఎంతో షాక్ కి గురయ్యారు. ఒక్క నిమిషం ఈ షాక్ నుంచి తేరుకొని హుటాహుటిన శారదను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…