సాధారణంగా మనం మొసలిని చూడగానే దాని క్రూరత్వం గుర్తుకు వచ్చి వెంటనే భయంతో ఆమడ దూరం పరిగెడతాము. ఒక్కసారి మొసలి చేతికి దొరికామంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అంతటి భయంకరమైన జంతువు ఒక ఆలయానికి కాపలాగా ఉందని విషయం తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అయితే ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఏమీ అనదు.. అదే విధంగా పూజారి చెప్పిన మాటను ఎంతో చక్కగా వినే ఈ మొసలి కేరళలో అనంత పద్మనాభ ఆలయంలో ఉంది.
అనంత పద్మనాభ ఆలయంలోని సరస్సులో ఉండే ఈ మొసలిని భక్తులందరూ బబియా అనే పేరుతో పిలుస్తారు. ఈ సరస్సుకు ఆనుకొని ఉన్న పద్మనాభ ఆలయానికి మొసలి కాపలాగా ఉంటుంది. ఈ మొసలి ప్రత్యేకత ఏమిటంటే ఇది మాంసం ముట్టుకోదు, కేవలం ప్రతిరోజు ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తుంది. కొన్నిసార్లు ఈ మొసలి సరస్సు నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆలయంలో భక్తులకు ఏ మాత్రం హాని కలిగించదు. పూజారి చెప్పిన విధంగా నడుచుకోవడం దీని ప్రత్యేకత.
కథనం ప్రకారం 1945లో.. అంటే సుమారు 76 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో సంచరిస్తున్న మొసలిని చంపేశాడు. మొసలిని చంపిన కొద్ది రోజులకే ఆ సైనికుడు పాముకాటుకు గురై మరణించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైనికుడు చనిపోయిన కొన్ని రోజులకే ఈ సరస్సులో మరో మొసలి కనిపించడంతో ఇదంతా ఆ భగవంతుని కృప అని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. ప్రస్తుతం ఈ మొసలికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…