సాధారణంగా రైలు పట్టాలు దాటడం చట్టపరంగా నేరం అనే విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా రైలు పట్టాలు దాటడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు తలెత్తవచ్చు. ఈ క్రమంలోనే ఓ 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాలను దాటుతూ ప్రమాదం అంచున వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. కేవలం లోకో పైలెట్ల సమయస్ఫూర్తితో వృద్ధుడు బతికి బట్ట కట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబై సమీపంలోని కళ్యాణ్ స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ఒక వృద్ధుడు పట్టాలు దాటుతుండగా ఆకస్మికంగా పట్టాలపై పడిపోయాడు. ఇది గమనించిన చీఫ్ పర్మనెంట్ వే ఇన్ స్పెక్టర్ సంతోష్ కుమార్, లోకో పైలట్లు ఎస్ కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జీ. రవిశంకర్ లను హెచ్చరికలను జారీ చేస్తూ వృద్ధుడికి తెలిసే విధంగా హెచ్చరికలు చేయాలని తెలిపారు. అయితే ఆ హెచ్చరికలను కాదని లోకో పైలెట్లు ఇద్దరూ అత్యవసర బ్రేకులు వేసే ఆ వృద్ధుడిని కాపాడారు.
అత్యవసర బ్రేకులు వేసి రైలు ఆపిన ఇద్దరు పైలెట్లు తరువాత రైలు కింద పడిన వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలోనే లోకో పైలెట్లు సమయస్ఫూర్తిని ఉపయోగించి 70 ఏళ్ల వృద్ధుడిని చావు నుంచి కాపాడారని లోకో పైలెట్ల పై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా సీపీడబ్ల్యుఐకి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ఇద్దరు లోకో పైలెట్లకు రెండు వేల రూపాయలు నగదు బహూకరించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…