కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అయితే ఈ జాబితాలోకి తాజాగా గోవా కూడా వచ్చి చేరింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అక్కడ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
గోవాలో ఏప్రిల్ 29 నుంచి మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా లాక్డౌన్ను విధిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడి అన్ని బార్లు, పబ్లు, కసినోలు మూత పడనున్నాయి. అయితే రెస్టారెంట్లలో తినేందుకు అనుమతించరు. కానీ హోం డెలివరీలకు అనుమతి ఉంటుంది.
గోవాలో లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణాను కూడా నిలిపివేయనున్నారు. ఇక కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిత్యావసరాలను కొనేందుకు ప్రజలకు రోజూ కొంత సమయం పాటు అనుమతించనున్నారు. కరోనా చెయిన్ను బ్రేక్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…