దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రైల్వే మంత్రిత్వ శాఖ రైళ్లలో కోచ్లను కోవిడ్ చికిత్స సెంటర్లుగా మారుస్తోంది. అందులో భాగంగానే కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక కోచ్లను రైల్వే సిద్ధం చేసింది. మొత్తం 5600 కోచ్లకు గాను 3816 కోచ్లను రైల్వే ఇప్పటి వరకు కోవిడ్ చికిత్స సెంటర్లగా మార్చింది.
రైల్వే సిద్ధం చేసిన కోవిడ్ చికిత్స కోచ్లలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఈ కోచ్లు బాధితులకు అందుబాటులో ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో పెరిగే కోవిడ్ రోగుల సంఖ్యను బట్టి మరిన్ని కోచ్లను సిద్ధం చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
కాగా ఢిల్లీలో 1200 బెడ్లతో 75 కోచ్లను సిద్ధం చేయగా, ఉత్తరప్రదేశ్లో 50 కోచ్లను సిద్ధం చేశారు. ఇక 215 స్టేషన్లలో మరిన్ని కోచ్లను సిద్ధం చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే 85 స్టేషన్లలో మాత్రమే రైల్వే తన సొంత సిబ్బందిని వినియోగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో మిగిలిన 130 స్టేషన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలే సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే తెలిపింది. అయితే రానున్న రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా పెరగనున్న దృష్ట్యా ఇంకా ఏయే స్టేషన్లలో రైల్వే శాఖ కోవిడ్ చికిత్స కోచ్లను ఏర్పాటు చేస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…