అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంభల్ జిల్లాకు చెందిన జావేద్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనిపై గోవధ ఆరోపణలు వచ్చాయి. అయితే అతని పిటిషన్ను విచారించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అతనికి బెయిల్ నిరాకరించారు. జావేద్ గతంలో పలు మార్లు గోవులను వధించాడని, అతనికి బెయిల్ ఇస్తే బయటకు వచ్చాక అతను మళ్లీ అదే పనిచేస్తాడని, కనుక అతనికి బెయిల్ ఇవ్వకూడదని ప్రతివాదులు కోరారు. ఇందుకు న్యాయమూర్తి ఏకీభవించారు. అంతేకాదు, ఆయన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు.
ప్రపంచంలో ఆక్సిజన్ను పీల్చి ఆక్సిజన్ను వదిలే ఏకైక జంతువు ఆవు అని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అన్నారు. దీన్ని సైంటిస్టులు కూడా నిర్దారిస్తారని తెలిపారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడతో తయారు చేసే పంచగవ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, దాంతో అనేక వ్యాధులు నయం అవుతాయని అన్నారు. అందువల్ల ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు. కాగా ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…