ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న కుంభమేళాతో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కుంభమేళ కారణంగా వందలాది మంది కరోనా బారిన పడటంతో వెంటనే కుంభమేళా ఆపు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 17న కుంభమేళ ముగిస్తున్నట్టు నిర్వాహకుడు నిరంజని అఖాడా ప్రకటించారు. ఈ కుంభమేళాలో పాల్గొనే 13 మంది అఖాడాలలో నిరంజని రెండవవారు.ఇప్పటికే పెద్ద అఖాడా అయిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కోవిడ్ -19 కారణంగా మరణించాడు. కోవిడ్ నిర్ధారణ కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న మృతిచెందారు.
అధిక సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలిరావడంతో వందల సంఖ్యలో భక్తులు కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కుంభమేళాలో పాల్గొన్న సాధువులు ఎక్కువగా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. సాధారణంగా నాలుగు నెలల పాటు జరిగే ఈ కుంభమేళ ఉత్సవాలు కరోనా కారణం వల్ల నెలరోజులకే ముగుస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…