కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితోపాటు పూర్తిగా కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తున్న విషయం విదితమే. అయితే నిన్న మొన్నటి వరకు వైట్ ఫంగస్ కేసులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా యెల్లో ఫంగస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్దారించారు. కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తికి యెల్లో ఫంగస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో యెల్లో ఫంగస్ మొదటి కేసు నమోదైంది.
ఘజియాబాద్లో ఉన్న ఓ ఈఎన్టీ హాస్పిటల్లో యెల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా యెల్లో ఫంగస్ అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వ్యక్తి పరిశుభ్రతను పాటించకపోతే యెల్లో ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
యెల్లో ఫంగస్ బారిన పడిన వారిలో బద్దకం, ఆకలి లేకపోవడం లేదా తక్కువ ఆకలి ఉండడం, బరువు వేగంగా తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ వచ్చిన వారు ఈ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇక యెల్లో ఫంగస్ వచ్చినవారికి యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…