కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితోపాటు పూర్తిగా కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తున్న విషయం విదితమే. అయితే నిన్న మొన్నటి వరకు వైట్ ఫంగస్ కేసులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా యెల్లో ఫంగస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్దారించారు. కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తికి యెల్లో ఫంగస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో యెల్లో ఫంగస్ మొదటి కేసు నమోదైంది.
ఘజియాబాద్లో ఉన్న ఓ ఈఎన్టీ హాస్పిటల్లో యెల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా యెల్లో ఫంగస్ అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వ్యక్తి పరిశుభ్రతను పాటించకపోతే యెల్లో ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
యెల్లో ఫంగస్ బారిన పడిన వారిలో బద్దకం, ఆకలి లేకపోవడం లేదా తక్కువ ఆకలి ఉండడం, బరువు వేగంగా తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ వచ్చిన వారు ఈ ఫంగస్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇక యెల్లో ఫంగస్ వచ్చినవారికి యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…