గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. గుత్తి వంకాయ కూర చపాతి, పరోటా వంటి వాటిలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నోరూరించే ఎంతో రుచికరమైన ఈ గుత్తి వంకాయ కూరను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
*మీడియం సైజు వంకాయలు అరకిలో
*వేరుశనగ విత్తనాలు ఒక కప్పు
*కొబ్బెర ఒక కప్పు
*ఒక పెద్ద సైజు వెల్లుల్లి
*ఉల్లిపాయ ఒకటి
*రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి
*నాలుగు లవంగాలు
*కొత్తిమీర
*టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు
*ఉప్పు తగినంత
*కారం పొడి 2 టేబుల్ స్పూన్లు
*పసుపు
*నీళ్లు
*నూనె
ముందుగా గోళంలో వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకోవాలి. తరువాత నువ్వులను చిటపట అంతవరకు వేయించుకోవాలి. వేరుశనగ విత్తనాలు చల్లబడిన తర్వాత వేరుశనగ విత్తనాలు, నువ్వులు, కొబ్బెర, ధనియాల పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, లవంగాలు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మసాలా తయారు చేసుకునేటప్పుడు నీరు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మసాలాను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ మసాలాలోకి నీళ్లు వేయకూడదు.
తరువాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత వంకాయలను పూర్తిగా కాకుండా తొడిమ వరకు నాలుగు ముక్కలుగా కత్తిరించి నీటిలో వేసుకోవాలి. తరువాత ఒక్కొక్క వంకాయ తీసుకొని ముందుగా తయారు చేసుకొన్న మసాలాను కట్ చేసిన వంకాయలోపు పెట్టి గట్టిగా అదమాలి. ఈ విధంగా వంకాయలు అన్నింటిలోకి మసాలను పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి పోపు పెట్టాలి. ఆవాలు మగ్గిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసుకున్న మసాలాలను వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలాలోకి చిటికెడు పసుపు వేసి మసాలా బాగా మగ్గిన తర్వాత మనకు కావలసిన నీటిని వేసుకోవాలి. నీరు బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మసాలా పెట్టిన వంకాయలను అందులో వేసి చిన్న మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత గిన్నెలో నూనె మొత్తం పైకి తేలితే మనకు గుత్తి వంకాయ కూర తయారైనట్లే.. వేడివేడిగా గుత్తి వంకాయ పరోటా లేదా చపాతీ వంటివాటిలోకి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…