మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు శ్మశానానికి తరలిస్తారు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే క్రమంలో దింపుడు కల్లం ఉంటుంది. అక్కడ శవాన్ని కింద పెట్టి మూడు సార్లు చెవిలో పిలుస్తారు. చనిపోయిన తమ ఆత్మీయులు ఏదో ఒక అదృష్టం వల్ల బతికి వస్తారని ఆశ. అయితే చనిపోయిన వారు బతికిరారు, కానీ అలా పిలవడం ఒక ఆచారం. కానీ ఆ బాలుడు మాత్రం నిజంగానే అలా తిరిగి వచ్చాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా తన తల్లి పిలిచిన మాటలకు అతను స్పందించాడు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని బహదూర్గఢ్ ప్రాంతం అది. హితేష్, ఝాన్వి అనే దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దీంతో చికిత్స అందించారు. అయితే అతను చనిపోయాడు. మే 26న ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను మరణించాడని వైద్యులు నిర్దారించడంతో తల్లిదండ్రులు చేసేది లేక గుండెలవిసేలా రోదిస్తూ తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తరువాత అంత్యక్రియలు నిర్వహించేందుకు పూనుకున్నారు.
అయితే కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారనగా ఆ బాలుడి తల్లి ఆర్తనాదాలు చేసింది. ఒక్కసారి లేవరా కన్నా.. అంటూ పిలిచింది. అయితే అదృష్టవశాత్తూ ఆ బాలుడు స్పందించాడు. అతనిలో కదలిక వచ్చింది. దీంతో వెంటనే అతని తండ్రి అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించాడు. ఈ క్రమంలో బాలుడికి హాస్పిటల్లో చికిత్స అందించగా అతను కోలుకుని ఆరోగ్యవంతుడు అయ్యాడు. జూన్ 15న అతను డిశ్చార్జి అయ్యాడు. చనిపోయాడనుకున్న తమ కుమారుడు బతికి వచ్చే సరికి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…