IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం భారత్నే వరించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని విండీస్ ఓ దశలో ఛేదించేలాగే కనబడినా పరుగుల వేటలో కాస్త వెనుకబడింది. దీంతో చివరి ఓవర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువయ్యాయి. వాటిని సాధించలేక విండీస్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దీంతో భారత్.. విండీస్పై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా ఫీల్డింగ్ చేయగా.. భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుబమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రాణించారు. శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకోగా.. గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అలాగే అయ్యర్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్, గుడకేష్ మోతీలు చెరో 2 వికెట్లు తీశారు. రొమారియో షెఫర్డ్, అకియల్ హోసెయిన్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 305 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కైలీ మయర్స్, బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్ రాణించారు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్తో మయర్స్ 75 పరుగులు చేయగా, 66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కింగ్ 54 పరుగులు చేశాడు. అలాగే 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో బ్రూక్స్ 46 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చాహల్లకు తలా 2 వికెట్ల చొప్పున దక్కాయి. ఈ సిరీస్లో 2వ వన్డే ఆదివారం మళ్లీ ఇదే స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…