IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం భారత్నే వరించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని విండీస్ ఓ దశలో ఛేదించేలాగే కనబడినా పరుగుల వేటలో కాస్త వెనుకబడింది. దీంతో చివరి ఓవర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువయ్యాయి. వాటిని సాధించలేక విండీస్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దీంతో భారత్.. విండీస్పై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా ఫీల్డింగ్ చేయగా.. భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుబమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రాణించారు. శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకోగా.. గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అలాగే అయ్యర్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్, గుడకేష్ మోతీలు చెరో 2 వికెట్లు తీశారు. రొమారియో షెఫర్డ్, అకియల్ హోసెయిన్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 305 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కైలీ మయర్స్, బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్ రాణించారు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్తో మయర్స్ 75 పరుగులు చేయగా, 66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కింగ్ 54 పరుగులు చేశాడు. అలాగే 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో బ్రూక్స్ 46 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చాహల్లకు తలా 2 వికెట్ల చొప్పున దక్కాయి. ఈ సిరీస్లో 2వ వన్డే ఆదివారం మళ్లీ ఇదే స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…