Vitamin D Tablets : ప్రతి మనిషి శరీర ఎదుగుదలకు విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందేలా చేస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు కావలసినంత విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితుల వల్ల విటమిన్ డి అనేది శరీరానికి సక్రమంగా అందడం లేదు. దీని కారణంగా ఎటువంటి డాక్టర్ సలహా లేకుండా అనేక మంది శరీరానికి విటమిన్ డి అందించడం కోసం టాబ్లెట్స్ రూపంలోఎక్కువగా తీసుకుంటున్నారు. టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వలన విటమిన్ డి అనేది మన శరీరంలో ఎక్కువైతే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం స్థాయి కూడా పెరిగి ఆకలి తగ్గిపోవటం జరుగుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా శరీరంలో విటమిన్ డి ఎక్కువ అవ్వటం వలన ఎముకల మీద వ్యతిరేక ప్రభావం పడుతుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అంతేకాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఏ విధమైన వైద్యుని సలహా లేకుండా విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోకూడదు. విటమిన్ డి తీసుకుంటే రకరకాల వైరస్ మరియు బ్యాక్టీరియాల నుంచి రక్షణ పొందవచ్చు. కానీ మోతాదుకు మించి తీసుకోకూడదు. విటమిన్ డి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తొందరగా కనిపించవు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ డి టాబ్లెట్స్ వాడడం ఉత్తమం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…