Hyper Aadi : బుల్లితెరపై బెస్ట్ కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ళు గడిచినా ఆ షో హవా తగ్గడం లేదు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు. ఇక రీసెంట్ గా మాత్రం కొందరు.. నిర్వాహకులతో వచ్చిన విబేధాలతో షో నుంచి బయటకు వెళ్లిపోయారు. దానికి కారణాలు ఏవైనా కానీ షో మేనేజర్ ఏడుకొండలు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్స్ జబర్దస్త్ కంటెస్టెంట్లను ఏకిపారేశారు. వాళ్ళ దగ్గర పక్క ఆధారాలున్నాయని జబర్దస్త్ షోకి రాకుండా ఎలా తప్పుకుంటారో చూస్తానని ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలను నిజం చేస్తూ కొద్దిరోజుల క్రితమే గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఇదిలా వుండగా తాజాగా జబర్దస్త్ షోలోకి హైపర్ ఆది రీఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. దానికి కారణం.. హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ నవ్వులు, పంచులు, డబల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే ఘాటు కౌంటర్లతో హంగామా చేస్తాడు. అయితే ఆది మొదటి ఎపిసోడ్ లోనే స్టార్స్ పై పంచులు వేసి హైలైట్ అయ్యాడు. హైపర్ ఆది ఎంట్రీ ఇస్తుండగా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నట్లు అతడికి స్వాగతం పలికారు. నేను వచ్చింది జబర్దస్త్ లోకా లేక రాజకీయాల్లోకా అని అనుమానం కలిగింది అని హైపర్ ఆది అంటాడు.
మరో కమెడియన్ స్కిట్ లో భాగంగా పరీక్ష రాసినప్పటికీ తనకి సీటు రాలేదు అని అంటాడు. వస్తుంది లేరా అని హైపర్ ఆది చెబుతాడు. ఏముంది.. రోజా గారికి మంత్రి సీటు రాలేదా.. ఇంద్రజ గారికి జబర్దస్త్ సీటు రాలేదా.. సీటు రావడం పెద్ద విషయం కాదు అన్నట్లు రోజాపై పరోక్షంగా హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జబర్దస్త్ నుంచి రోజా వెళ్ళిపోగానే నీకు నోరు ఎక్కువైపోయింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఫైనల్ గా జబర్దస్త్ కి హైపర్ ఆది ఒక రేంజ్ లో రీఎంట్రీ ఇచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…