Holi Festival 2022 : భారతీయులు ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఘనంగా జరుపుకునే వాటిల్లో హోలీ పండుగ ఒకటి. ఈ హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ హోలీ పండుగ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రంగు రంగుల నీళ్లతో ఎంతో ఘనంగా వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఇలా హోలీ పండుగను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి ? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం హోలీ పండుగ అనేది సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు తెలుపబడింది. పురాణాల ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అయితే విష్ణువును పూజించడం ఏమాత్రం సహించని హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నంలో భాగమే తన చెల్లెలు హోలికను పిలిచి తనకున్న వరం కారణంగా ప్రహ్లాదుడిని మంటలకు ఆహుతి చేయమని చెబుతాడు. దీంతో హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతి అవుతుంది.
విష్ణుమూర్తి మాయవల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడగా హోలిక మాత్రం అగ్నికి ఆహుతిగా మారిపోతుంది. ఈ విధంగా హోలిక అగ్నికి ఆహుతి కావడం వల్ల ఈ పండుగను హోలీ పండుగగా, హోలికా దహనంగా జరుపుకుంటారు. అప్పటినుంచి ఈ రోజున దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. పూర్వం ఈ పండుగను రంగు రంగుల పుష్పాలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ జరుపుకునే వారు. ప్రస్తుతం ఈ పండుగను వివిధ రకాల రంగులు రంగుల నీటితో జరుపుకుంటున్నారు. అయితే వసంత రుతువు వచ్చిందనే సంతోషంతోనూ ఈ పండుగను జరుపుకుంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…