Laya : ఒకప్పటి అందాల హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 90లలో హీరోయిన్గా ఎంతగానో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 1999 నుంచి 2003 వరకు ఈమెకు గోల్డెన్ టైమ్ నడిచిందనే చెప్పాలి. ఆ సమయంలో లయ నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ, లవ్ ఓరియెంటెడ్ చిత్రాలతో లయ ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈమె తెలుగు హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి తెలుగు హీరోయిన్ల తరువాత లయకే అంత పేరు వచ్చిందని చెప్పవచ్చు.
లయ చూడచక్కని అందం, అభినయంతోనే కాదు.. తన నాట్యంతోనూ ఆకట్టుకుంది. స్వతహాగా నృత్యాకారిణి కావడంతో సినిమాల్లో చేయడం ఈమెకు పెద్దగా ఇబ్బంది కాలేదు. గ్లామర్ షో చేయకపోయినా ఈమెకు నటన పరంగా అవకాశాలు బాగానే వచ్చాయి. ఇక లయకు సినీ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఈమె సినిమాల్లో రాణిస్తుండగానే డాక్టర్ శ్రీగణేష్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుంది. తరువాత అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. వీరికి ఒక కుమారుడు వచన్, కుమార్తె శ్లోక ఉన్నారు.
అయితే లయ అప్పుడప్పుడు తన కుమార్తెతో కలిసి పలు సినిమా పాటలకు డ్యాన్స్లు చేస్తూ అలరిస్తుంటుంది. కానీ ఈమె కుమార్తెకు చెందిన ఫొటోలను క్లోజప్లో ఏవీ విడుదల చేయలేదు. ఇక ఇటీవలే తన భర్త, పిల్లలతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో లయ ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.
ఇక ఈమధ్యే ఆమె తన కుమార్తె శ్లోక ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమెను చూసి అచ్చం తల్లిలాగే క్యూట్గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె కుమార్తె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే శ్లోక సినిమాల్లోకి వస్తుందా.. రాదా.. అనే విషయం మాత్రం సందిగ్ధమే. ఎందుకంటే లయ అమెరికాలో సెటిల్ అయింది కనుక తన పిల్లలను సినిమాల వైపు కాకుండా ఇతర రంగాల వైపు మళ్లించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…