Laila : ఒకప్పటి హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. ఓ టైములో తమ గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు తర్వాత పలు కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమవ్వడం.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరుగుతూనే ఉంది. ఈ లిస్ట్ లో ఒకప్పటి హీరోయిన్ లైలా కూడా ఉంది. ఈమె తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఎగిరే పావురమా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లైలా మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించింది కానీ తెలుగులో చేయలేదు. అయితే ప్రస్తుతం కార్తీ నటిస్తున్న సర్ధార్ అనే మూవీలో లైలా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందట. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కానుంది. అభిమన్యుడు వంటి హిట్ చిత్రాన్ని అందించిన పి.ఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ మూవీలో కార్తీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అయితే దాదాపుగా 15 ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇస్తుంది.
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఈ మూవీలో నా పాత్ర ఉంటుందని చెప్పగలను. నా కెరీర్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల కోసం ఎప్పుడూ తపన ఉండేది. సర్దార్ తో ఖచ్చితంగా ఆ కోరిక తీరింది. ఇప్పటి హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా పెర్ఫార్మన్స్ కు ఆస్కారం ఉన్నవి కూడా చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది లైలా. డైరెక్టర్ మిత్రన్ గురించి మాట్లాడుతూ.. ఇది ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ అని అతన్ని ప్రశంసించింది. సర్ధార్ మూవీ ఈ నెల 21 విడుదల కానుంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…