Baahubali : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి 1, 2 సినిమాలు గొప్ప కళాఖండాలు అనే చెప్పవచ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన అద్భుతమైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని మాట్లాడుకోవచ్చు. ఇక ఈ సినిమాల దర్శకుడు రాజమౌళిని కచ్చితత్వానికి, సంక్లిష్టతకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో విశ్లేషణతో రూపొందిండంలో ఆయనను మించిన వారు లేరు. అలాగే బాహుబలి 2 సినిమాను తీసుకున్నప్పుడు కూడా దానిలో అంతర్లీనంగా దాగి ఉన్న ఎన్నో విషయాలు మామూలు ప్రేక్షకుల దృష్టికి వచ్చి ఉండవు.
ప్రేక్షకులు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసినప్పటికీ అందులోని విషయాలను గుర్తించరు. అలాంటి ఒక సన్నివేశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. బాహుబలి 2 చిత్రంలో అమరేంద్ర బాహుబలిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించేందుకు అలాగే భల్లాల దేవుడిని రాజుగా పట్టాభిషేకం జరిగే సన్నివేశంలో అతని సింహాసనానికి ఎదురుగా ఎందరో రాజులు, మంత్రులు, ఇంకా కుంటాల రాజ్యం నుండి వచ్చిన వారు కూడా ఆసీనులై ఉంటారు. వారిలో కుడి వైపు కూర్చున్న వారి ఆసనాలపై రక్షణగా గొడుగు లాంటి నిర్మాణాలు ఉంటాయి. కానీ ఎడమ వైపు కూర్చున్న వారికి మాత్రం అలాంటివేవీ లేకపోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే కుడి వైపున మాహిష్మతి రాజ్యానికి చెందిన వారు కూర్చొని ఉండగా, ఎడమ వైపు దేవసేన రాజ్యం కుంటాలకి చెందిన వారు ఆసీనులై ఉంటారు. దర్శకుడు దీని ద్వారా భల్లాల దేవుడి పక్షపాత వైఖరిని చూపించాలని భావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఇదే విధంగా అమరేంద్ర బాహుబలి కొడుకైన మహేంద్ర బాహుబలి భల్లాల దేవుడిని ఓడించి తన పట్టాభిషేకం జరిగే సమయంలో అతనికి ఎదురుగా రెండు వైపులా కూర్చున్న వారికి పైన గొడుగులు ఉండడం గమనించవచ్చు. కాగా భల్లాల దేవుడి పాలనలో సామ్రాజ్యంలో అసమానత, అప్రజాస్వామ్యం, అసూయ, ద్వేషం లాంటివి నిండి ఉండగా, అదే మహేంద్ర బాహుబలి పాలనలో సమానత్వం, సానుభూతి, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతాయని దర్శకుడు ఆ ఇద్దరి మధ్య తేడాను చూపించాడు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలను కూడా అంత శ్రద్ధతో తీయడం ఒక్క రాజమౌళికే చెల్లిందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…