Baahubali : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి 1, 2 సినిమాలు గొప్ప కళాఖండాలు అనే చెప్పవచ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన అద్భుతమైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని మాట్లాడుకోవచ్చు. ఇక ఈ సినిమాల దర్శకుడు రాజమౌళిని కచ్చితత్వానికి, సంక్లిష్టతకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో విశ్లేషణతో రూపొందిండంలో ఆయనను మించిన వారు లేరు. అలాగే బాహుబలి 2 సినిమాను తీసుకున్నప్పుడు కూడా దానిలో అంతర్లీనంగా దాగి ఉన్న ఎన్నో విషయాలు మామూలు ప్రేక్షకుల దృష్టికి వచ్చి ఉండవు.
ప్రేక్షకులు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసినప్పటికీ అందులోని విషయాలను గుర్తించరు. అలాంటి ఒక సన్నివేశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. బాహుబలి 2 చిత్రంలో అమరేంద్ర బాహుబలిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించేందుకు అలాగే భల్లాల దేవుడిని రాజుగా పట్టాభిషేకం జరిగే సన్నివేశంలో అతని సింహాసనానికి ఎదురుగా ఎందరో రాజులు, మంత్రులు, ఇంకా కుంటాల రాజ్యం నుండి వచ్చిన వారు కూడా ఆసీనులై ఉంటారు. వారిలో కుడి వైపు కూర్చున్న వారి ఆసనాలపై రక్షణగా గొడుగు లాంటి నిర్మాణాలు ఉంటాయి. కానీ ఎడమ వైపు కూర్చున్న వారికి మాత్రం అలాంటివేవీ లేకపోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే కుడి వైపున మాహిష్మతి రాజ్యానికి చెందిన వారు కూర్చొని ఉండగా, ఎడమ వైపు దేవసేన రాజ్యం కుంటాలకి చెందిన వారు ఆసీనులై ఉంటారు. దర్శకుడు దీని ద్వారా భల్లాల దేవుడి పక్షపాత వైఖరిని చూపించాలని భావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఇదే విధంగా అమరేంద్ర బాహుబలి కొడుకైన మహేంద్ర బాహుబలి భల్లాల దేవుడిని ఓడించి తన పట్టాభిషేకం జరిగే సమయంలో అతనికి ఎదురుగా రెండు వైపులా కూర్చున్న వారికి పైన గొడుగులు ఉండడం గమనించవచ్చు. కాగా భల్లాల దేవుడి పాలనలో సామ్రాజ్యంలో అసమానత, అప్రజాస్వామ్యం, అసూయ, ద్వేషం లాంటివి నిండి ఉండగా, అదే మహేంద్ర బాహుబలి పాలనలో సమానత్వం, సానుభూతి, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతాయని దర్శకుడు ఆ ఇద్దరి మధ్య తేడాను చూపించాడు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలను కూడా అంత శ్రద్ధతో తీయడం ఒక్క రాజమౌళికే చెల్లిందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…